వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మన ప్రాంతం, మన రాష్ట్రం స్వచ్ఛదనంతో ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాధన సాధ్యమవుతుందని అన్నారు. ప్రతీఒక్కరూ స్వచ్ఛాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొత్తచెరువు మండల ప్రధాన కేంద్రంలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛదివస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.