అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేసీ మాట్లాడుతూ. మేళాకి 7 కంపెనీల ప్రతినిధులు హాజరుకాగా, సుమారు 380 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారన్నారు.