అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గుత్తి వర్కింగ్ జర్నలిస్టులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి వ్యాఖ్యలను ఆసరాగా చేసుకొని మీడియా సంస్థలపై దాడి చేయడం తగదని యూనియన్ నాయకులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని ప్రశ్నించారు.