అనంతపురం నగరంలోని రాజీవ్ కాలనీలో మహాత్మా గాంధీ, సీఆర్డీఎస్ రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లర్నింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురువారం ఓ నిరుపేద మహిళకు సహాయం అందించారు. 3నెలల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి, రూ 10, 000 విలువైన కుట్టు మిషన్, పౌష్టికాహారం, బట్టలను దాతల సహకారంతో అందజేశారు. డైరెక్టర్ సద్దాం భాష మాట్లాడుతూ, ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం మరణించారని కష్టాలను నివేదించిందని చెప్పారు.