పరిగి మండలం గొర్రెపల్లి ఫ్రీ కాట్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు కార్మికులతో కలసి వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ మిల్లు ఎదుట బైఠాయించారు. దశాబ్దాలుగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఫ్రీ కాట్ మిల్లు మంత్రి నిర్లక్ష్యం వల్ల ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిందని ఉపాధి లేక వందలామంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రీ కాట్ మిల్లు కార్మికులు పరిగి మండల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.