అనంతపురం పట్టణంలో డివైడర్ ను ఢీకొని ఇంటర్ చదువుతున్న విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మేడాపురం గ్రామానికి చెందిన పినపెద్ద నారాయణస్వామి కుమారుడు కిరణ్ (17) ఇంటర్ చదువుతున్నాడు. కిరణ్ తన ద్విచక్ర వాహనంలో వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు పట్టణంలోని ఓ డివైడర్ ను ఢీకొన్నాడు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.