అనంతపురం లోని అరవింద్ నగర్, ఆదర్శ్ నగర్ లోని 32వ డివిజన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ లు గురువారం పింఛన్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతంలో పింఛను కోసం ఎదురుచూసే పరిస్థితి ఉందని, ఉదయం 6 గంటలకే మా పెద్ద కొడుకు పింఛన్ ఇస్తున్నారని లబ్ధిదారులు అంటున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తామని అన్నారు.