బైక్ దొంగలను బత్తలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ కథనం ప్రకారం. బత్తలపల్లి పోలీసులు వై జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో రెండు బైకులపై ఆరుగురు వ్యక్తులు వస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు 11 టూవీలర్లను చోరీ చేసినట్లు అంగీకరించారు. వీరందరూ కూడా అనంతపురం పట్టణానికి చెందిన యువకులే కావడం విశేషం.