ధర్మవరం పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి సత్య కుమార్ శనివారం పాల్గొని సతీసమేతుడైన స్వామివారిని దర్శించుకొని, పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పూర్ణకుంభ నివేదనను తిలకించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించేలా, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా కరుణించమని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు