ధర్మవరం నియోజకవర్గం పోతుకుంటలో సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా బీసీ కాలనీలోని 500 కుటుంబాలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది అన్నారు.