ధర్మవరం పట్టణంలోని సెరికల్చర్ కార్యాలయం వద్ద స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహానికి మంత్రి సత్య కుమార్ బుధవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. అసమాన పోరాట యోధుడు వడ్డె ఓబన్న, ఆప్త మిత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి తోడుగా ఆంగ్లేయులను ఎదిరించి, అమరుడైన రేనాటి వీరుడు. బ్రిటిషర్ల దౌర్జన్యాలు, ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని తరతరాలు గుర్తుంచుకోవాలన్నారు.