ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య, రక్షణ కోసం త్రివిధ దళాలు పాకిస్తాన్తో జరిగిన యుద్ధ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో త్రివిధ దళాలకు విజయము చేకూరాలని, దేశ ప్రజలకు హాని జరగకూడదని ఆకాంక్షిస్తూ ధర్మవరం పట్టణంలోని ప్రాచీనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డితో కలసి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.