ధర్మవరం పట్టణంలో నిర్వహించిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి మడుగు తేరు కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అశేష భక్తజనం సమక్షంలో ఉత్సవమూర్తులను దర్శించుకొని, ప్రథమ పూజలో భాగమయ్యారు. పూజారుల ఆశీర్వాదం స్వీకరించారు. నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో జీవించేలా చూడమని లక్ష్మీ చెన్నకేశవుని ప్రార్థించానట్లు మంత్రి తెలిపారు.