ధర్మవరం ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ 8 మందికి లక్షా 93వేల రూపాయల చెక్కులను శనివారం ధర్మవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను సీఎంఆర్ఎఫ్ ఆదుకుంటోందని అయన అన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు శ్రీరామ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోందన్నారు.