ధర్మవరం: వాట్సాప్ లో ప్రజలు 161 ప్రభుత్వ సేవలు పొందవచ్చు

83చూసినవారు
ధర్మవరం: వాట్సాప్ లో ప్రజలు 161 ప్రభుత్వ సేవలు పొందవచ్చు
ధర్మవరంలోని శారదానగర్ లో బుధవారం వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు సచివాలయ ఉద్యోగులు అవగాహన కల్పించారు. వాట్సాప్ లోనే 161 ప్రభుత్వ సేవలు పొందవచ్చని సచివాలయ ఉద్యోగులు నిఖిల్, గురు కుమార్ ప్రజలకు వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సేవలు సాంకేతికంగా, సురక్షితంగా ఉంటాయని, ప్రజల గోప్యత పట్ల ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్