నేటి ప్రభుత్వం పేదల గుండెకు భరోసాగా రూ. 45 వేల విలువ చేసే ఇంజక్షన్ వేయించి, ప్రాణాల నుంచి కాపాడటం జరుగుతోందని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఈ గుండెపోటు అనేది అధికంగా బీపీ, షుగర్ ఉన్నవారికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. చాతి నొప్పి, ఎడమ భుజం లాగడం, ఆకస్మికంగా ఆయాసం రావడం, గుండె దడ రావడం, స్పృహ కోల్పోవడం లాంటివి గుండెపోటు లక్షణాలు అని తెలిపారు.