ధర్మవరం: హత్య కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

65చూసినవారు
ధర్మవరం: హత్య కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
ధర్మవరం మం. రేగాటిపల్లి సమీపంలో మార్చి 16న జరిగిన అక్కమ్మ(57) హత్య కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సీఐ ప్రభాకర్ గౌడ్ గురువారం తెలిపారు. నిందితులు షేక్షావలి, లోకేంద్ర మహిళను రేగాటిపల్లి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. ఆమెతో గొడవపడి రాళ్లతో కొట్టి చంపారని తెలిపారు. నిందితుల అరెస్టుకు కృషి చేసిన పోలీసులను డీఎస్పీ హేమంత్ కుమార్ అభినందించారు.

సంబంధిత పోస్ట్