ముడిగుబ్బ మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ నిర్వాహకులు డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్ హాజరై పరిశీలించినట్లు ముడిగుబ్బ పశు వైద్యాధికారి రామేశ్వరరావు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పశువులకు సంబంధించిన వివిధ రకాల చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. పశువులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.