ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రామాంజనేయులు పట్టణంలోని రైల్వే స్టేషన్లో కిందపడి మరణించినట్లు స్థానికులు గురువారం తెలిపారు. రామాంజనేయులు బెంగళూరులో బార్బర్ షాప్ నిర్వహిస్తుంటాడని, గ్రామంలో జరుగుతున్న పీర్ల పండగకు వచ్చాడని, తిరిగి బెంగళూరు వెళ్లే క్రమంలో రైల్వేస్టేషన్లో కూర్చుని ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలి మరణించినట్లు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.