ధర్మవరం మండలం గొట్టూరులో నిర్మించిన బహుళ ప్రయోజన గోదామును మంత్రి సత్యకుమార్ శనివారం ప్రారంభించారు. వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ గోదామును నాబార్డ్ సహకారంతో గొట్టూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపాలన సంఘం ఏర్పాటు చేసింది. మంత్రి మాట్లాడుతూ పంట దిగుబడుల నిల్వకు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కు ఈ గోదాము ఉపయోగకరం అన్నారు.