తాడిమర్రి: నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన నేత

50చూసినవారు
తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామానికి చెందిన రైతులు ఆకుల రంగనాయకులు, ఆకుల హరి 16 ఎకరాలు అరటి తోటను సాగు చేశారు. అయితే నిన్నటి రాత్రి కురిసిన తీవ్రమైన గాలి వానల కారణంగా 6 ఎకరాలు పంట నష్టపోయారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి గురువారం రైతులను పరామర్శించి వారికి జరిగిన నష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్