తాడిమర్రి: ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించిన ఎంపీడీవో

54చూసినవారు
తాడిమర్రి మండలంలోని నార్సింపల్లి గ్రామంలో జరుగుతున్న ఫీడర్ ఛానల్ పనులను ఎంపీడీవో వెంకట రంగారావు పరిశీలించారు. గురువారం ఏపీవో అనిల్తో కలిసి పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఇచ్చిన కొలతల ప్రకారం సక్రమంగా పనులు చేయాలని, కూలీ రూ. 307లు పడుతుందని తెలిపారు. అనంతరం ఏపీడీ చలపతితో కలిసి గ్రామంలో పశువుల కోసం నిర్మిస్తున్న తాగునీటి తొట్టెల నిర్మాణాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్