గుంతకల్లు పట్టణంలోని శ్రీ శంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మంగళవారం రాజ్ ఫౌండేషన్ చైర్మన్ గోపాల్ నాయుడు, వైస్ చైర్మన్ రామకృష్ణ నాయుడు మెరిట్ స్కాలర్ షిప్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా ముగ్గురు విద్యార్థినులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయలు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో ప్రతి ఏటా మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తున్నామన్నారు.