గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం జిల్లా ఎస్పీ జగదీశ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీని ఆలయ అధికారుల స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.