ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని గుంతకల్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ (ఎంవీఐ) రాజా బాబు పిలుపునిచ్చారు. గుంతకల్ ఆర్టీవో కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం దరిచేరదన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు.