గుంతకల్లులో ఈనెల 8 నుంచి ఆర్ఆర్బి, గ్రూప్-డీ పరీక్షలకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు డీవైఎఫ్ఎ పట్టణ అధ్యక్షుడు సురేంద్రబాబు మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 8 నుంచి పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ ఉమెన్స్ కళాశాలలో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్ఆర్బి, గ్రూప్-డీ పరీక్షలపై ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.