గుంతకల్లు మండలం నక్కన దొడ్డి గ్రామ రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 342 లో సబ్ డివిజన్ కొరకు పిజిఆర్ఎస్ లో రైతులు ఇచ్చిన అర్జీ విషయమై బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో వెళ్లి రెవెన్యూ పొలంను పరిశీలించారు. సదురు భూమిని వెంటనే సబ్ డివిజన్ చేయవలసిందిగా సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవో శ్రీనివాసు, తహశీల్దార్ రమాదేవి పాల్గొన్నారు.