గుత్తి మండలం బసినేపల్లిలో గురువారం రస్తా విషయంలో ఘర్షణ జరిగి బొలికొండి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదే గ్రామానికి చెందిన బొలికొండతో మరో వర్గానికి చెందిన రమేష్, రవి, వెంకటరాముడు కలిసి పొలందారి విషయంలో ఘర్షణపడి కర్రలతో దాడి చేశారు. ఇందులో బొలికొండి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.