గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం విజయవాడ సిటీ డీసీపీ ఉదయ్ రాణి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు డీసీపీ కి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆమె కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.