గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో శుక్రవారం నూతన పశువుల షెడ్డుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుత్తి టీడీపీ మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతన పశువుల షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు.