గుత్తి పట్టణ శివారులోని 44 హైవేపై గురువారం బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.