అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలిసిన శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు శనివారం ఆలయంలో స్వామికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. సాయంకాలం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని శేష వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు.