అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని కరిడికొండ గ్రామ సమీపంలోని కొండపై వెలిసిన నరసింహస్వామి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం ఉదయం హుండీలోని రూ. 20 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పూజారి శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని భక్తులు పోలీసులను కోరారు.