గుత్తి: ఐచర్ ద్విచక్ర వాహనం ఢీ ఇద్దరికీ గాయాలు

56చూసినవారు
గుత్తి మండలం రాజాపురం గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయి పవన్, రాజు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి ఆర్ఎస్ కు చెందిన సాయి పవన్, రాజు బైక్ లో గుంతకల్ కు బయలుదేరారు. మార్గ మధ్యలో ఐచర్ ఢీకొంది. గాయపడిన ఇద్దరినీ గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనంతపురానికి రెఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :