గుత్తిలోని చెర్లోపల్లి కాలనీలో సబీరా అనే మహిళ అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వైద్యులు సిఫారసు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.