పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరుతూ ఈనెల 22న గుత్తిలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హిందూ అనుసంధాన సంస్థల నాయకులు గోవిందు గురువారం తెలిపారు. వారు మీడియాతో మాట్లాడారు. ఈ శాంతి ర్యాలీలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు.