గుంతకల్లు మండలం పాత కొత్తచెరువు గ్రామంలో మంగళవారం వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజలు చేసి నూతన విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వాల్మీకుల్లో చైతన్యం పెరిగిందని, వారికి అన్నివిధాల అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జి నారాయణస్వామి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.