పామిడి పట్టణంలోని పురాతన భోగేశ్వర స్వామి దేవాలయం లో ఉన్న నవగ్రహాలకు శనివారం శని త్రయోదశి సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు భక్తుల సమక్షంలో చేపట్టారు. పౌర్ణమికి ముందు వచ్చిన త్రయోదశి సందర్భంగా పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నువ్వుల తైలంతో రుద్రాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రత్యేక వస్త్రాలంకరణ, అష్టోత్తరపూజలు, నవధాన్యాలు నవగ్రహల మేరకు సమర్పణ చేసి నివేదన హారతి గవించారు.