పామిడి మండలం రామరాజు పల్లెలో 3వ రోజు కొనసాగుతున్న సుంకులమ్మ, ముత్యాలయ్య వార్షిక బండిశుల తిరునాళ్లు వేలాది మంది భక్తుల మధ్య శుక్రవారం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అయన తనయుడు ఈశ్వర్ పాల్గొన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన జయరాం 7 కాండ్ల ఎద్దులతో బండి లాగే కార్యక్రమం చర్ణాకోలతో బండి తోలారు. సుడి బండి రథంకు వేలాడే పటానికి భక్తులు పెద్ద ఏత్తున పూల మాలలతో మొక్కులు తీర్చుకున్నారు.