అనంతపురం జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారి ప్రతినిధిగా ఎంపికైన ప్రవీణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపితం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.