సోమందేపల్లి మండలం లోని రాంబాబు కాలనీలో రోడ్లపైనే మురికి నీరు ప్రవహిస్తున్న అధికారులు చూసి చున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేక రోడ్లపైనే మురికి నీరు నిల్వ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు రోడ్లపై వెళ్లాలంటే మురికి నీరులో పడుతూ లేస్తూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్లపైనే మురికి నీరు ఉండడంతో రోడ్లన్నీ గుంతల మయంగా మారి మురికి నీరు అంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది.