హిందూపురం: రథం మరమ్మతులకు విరాళాలు అందించండి

హిందూపురంలో ప్రసిద్ధిగాంచిన పేట వెంకటరమణస్వామి రథ మరమ్మతులకు దాతలు విరాళాలు అందించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి కోరారు. బుధవారం రథ మరమ్మతులకు సంబంధించిన పనులను పరిశీలించారు. ప్రస్తుతమున్న రథ మరమ్మతులకు రూ. 12 లక్షలు వ్యయమవుతుందన్నారు. అతి పురాతనమైన దేవాలయ రథ మరమ్మతులకు దాతలు సహకారం అందించాలని కోరారు. మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జేపీకే రాము, కౌన్సిలర్ రాఘవేంద్ర ఉన్నారు.