శాస్త్రీయ సమాజ స్థాపన కోసం జనవిజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఈటి రామ్మూర్తి, పి. రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని పీపుల్స్ క్లినిక్ ఆవరణలో జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనవిజ్ఞాన వేదిక సామాన్య ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు.