సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో అన్ని తరగతులకు సీట్లు పెంచాలని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబావలి శనివారం హిందూపురంలో అన్నారు. త్రాగడానికి నీరు, హాస్టల్ కు సన్న బియ్యం సమకూర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నియోజకవర్గానికి మూడు లేదా నాలుగు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లయితే జిల్లాలో ఎక్కువ మంది ఉన్నపేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ఉంటుందన్నారు.