హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన దినోత్సవ సందర్భంగా పలువురు యువకులు రక్తదానంలో పాల్గొన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆల్ ఇమ్దాద్ ట్రస్ట్ అధ్యక్షులు అమన్, కార్యదర్శి ఉమర్ ఫారూఖ్ లతోపాటు పలువురిని ఆర్ఎంవో డాక్టర్ డేవిడ్ రాజు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ తదితరులు రక్తదాతలను ఘనంగా సత్కరించారు.