హిందూపురం పట్టణంలో ఆదివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసిపి ఇన్ఛార్జ్ దీపిక మాట్లాడుతూ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అన్ని మతాలు కులాలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని అప్పుడే అభివృద్ధి సాధిస్తాం అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ఆపాలని ఆమె తెలిపారు.