జమ్మూ కశ్మీర్ లో పాక్ జరిపిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మురళీ నాయక్ జవాన్ మురళీనాయక్ భౌతికకాయం శనివారం సత్యసాయి జిల్లా కల్లితండాకు చేరుకోనుంది. రాత్రి 7 గంటలకు మురళీనాయక్ భౌతికకాయంతో గుమ్మయగారిపల్లి నుంచి కళ్లితండాకు ర్యాలీ నిర్వహించనున్నట్టు సమాచారం. రేపు(ఆదివారం) కల్లితండాలో అధికారిక లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి.