హిందూపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి డాక్టర్ అను రాధ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జలుబు, దగ్గు, జ్వరము, మలేరియా, టైఫాయిడ్, డెంగీ లక్షణాలు, తీసు కోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులను పరీ క్షించి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేశారు.