పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం, రొద్దం మండలాల రోడ్డు మార్గ మధ్యలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోద్దం మండల వాసులు స్థానికంగా ఉండే చౌడమ్మ దేవస్థానానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై
హిందూపురం ఎంపీ పార్థసారథి తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఫోన్ చేసి మాట్లాడారు.