
నలుగురు మహిళలతో 14 మంది పిల్లలను కన్న మస్క్.. మరో మహిళకు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పటివరకు నలుగురు మహిళలతో కలిపి 14 మంది పిల్లలకు తండ్రిగా మారిన మస్క్, తాజాగా ఓ జపాన్ మహిళకు వీర్యదానం చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. జననాల రేటు తగ్గిపోతున్న నేపథ్యంలో మానవాళి భవిష్యత్ కోసం ఎక్కువ మంది పిల్లలను కనడం అవసరమన్న భావనతో మస్క్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలివైనవారు సంతానాన్ని పెంచకపోతే మానవ నాగరికతకు ప్రమాదం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం.